ఓ యువకుడు తన నాలుకను కోసి అమ్మవారికి అర్పించాడు. ఈ అరుదైన ఘటన ఉత్తర్​ప్రదేశ్​ బాందా నగరం బబేరూ పోలీస్​స్టేషన్​పరిధిలోని భాటీ గ్రామంలో జరిగింది. ప్రస్తుతం అతని నాలుకను అతికించే పనిలో ఉన్నారు వైద్యులు.శనివారం రోజు స్థానిక దుర్గామాత గుడిలోకి వెళ్లిన ఆత్మారామ్​ యాదవ్​.. బ్లేడుతో నాలుకను కోసి అమ్మవారి పాదాల చెంత ఉంచాడు.


దీంతో గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు.. చికిత్స కోసం అడగగా ఆ వ్యక్తి నిరాకరించినట్లు స్థానికులు పేర్కొన్నారు.తనను దేవుడు ఆవహించాడని, తలను అర్పిస్తే కుటుంబానికి మంచి జరుగుతుందని దేవత కలలోకి వచ్చి చెప్పింది. కానీ తన తల్లి వద్దని ప్రాధేయపడింది, అందుకే తాను నాలుకను కోసి దేవికి అర్పిస్తున్నా'నని ఆత్మారామ్ యాదవ్​ అన్న మాటలను ప్రత్యక్ష సాక్షి శ్యామ్​సుందర్​ యాదవ్​ వివరించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: