ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ బిహార్​ రాజకీయ నేతలు విమర్శల పదును పెంచారు. తాము అధికారంలోకి వస్తే నితీశ్​ కుమార్​ జైలుకు వెళ్తారని లోక్ జనశక్తి పార్టీ అధినేత చిరాగ్​ పాసవాన్ అన్నారు. రాష్ట్రంలోని డుమ్​రావ్​, బక్సర్​ నియోజకవర్గాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ప్రచార సభల్లోనే కాకుండా సామాజిక మాధ్యమాల్లోనూ సీఎం నితీశ్ కుమార్​ను చిరాగ్​ విమర్శిస్తున్నారు.


మేము అధికారంలోకి వస్తే నితీశ్​ కుమార్, ఆయన అధికారులు జైలుకు వెళ్లక తప్పదు. బిహార్​లో మద్యపాన నిషేధం అమలు చేయలేకపోయారు. కల్తీ మద్యం విచ్చలవిడిగా అమ్ముతున్నారు. ఇందుకోసం నితీశ్​ భారీగా ముడుపులు అందుకుంటున్నారు అని చిరాగ్​ పాసవాన్ అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: