ఉత్తర్​ ప్రదేశ్​లోని పీఎం స్వానిధి లబ్ధిదారులతో ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ముచ్చటించనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరగనున్న ఈ కార్యక్రమంలో ఉత్తర్​ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ పాల్గొననున్నారు.కరోనాతో దెబ్బ తిన్న వీధి వ్యాపారులను ఆదుకునేందుకు కేంద్రం ప్రకటించిన పథకమే ఈ స్వానిధి (పీఎం స్ట్రీట్ వెండర్స్ ఆత్మ నిర్భర్ నిధి).


ఇప్పటివరకు ఈ పథకానికి మొత్తం 24 లక్షలకుపైగా దరఖాస్తులు అందినట్లు ఆదివారం ప్రధాన మంత్రి కార్యాలయం(పీఎంఓ) ప్రకటించింది. అందులో 12 లక్షల వీధి వ్యాపారులకు రుణాలు మంజూరైనట్లు తెలిపింది. 5.35 లక్షల మందికి రుణాలు పంపిణీ కూడా అయినట్లు వివరించింది. ఒక్క ఉత్తర్​ప్రదేశ్​ నుంచే 6 లక్షల దరఖాస్తులు రాగా.. అందులో 3.27 లక్షల మందికి రుణాలు మంజూరు చేసినట్లు పీఎంఓ తెలిపింది. 1.87 లక్షల మంది వీధి వ్యాపారులకు రుణాలు పంపిణీ చేసినట్లు పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: