భారత రిజర్వు బ్యాంక్​ గవర్నర్ శక్తికాంతదాస్​​ కరోనా బారిన పడ్డారు. వైద్యపరీక్షల్లో కొవిడ్​-19 పాజిటివ్​గా వచ్చినట్లు ఆదివారం ఆయనే స్వయంగా వెల్లడించారు. ప్రస్తుతం లక్షణాలు లేకుండా క్షేమంగానే ఉన్నట్లు తెలిపిన ఆయన.. ఐసోలేషన్​లో ఉండి విధులు నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు. తనకు కాంటాక్ట్​ అయిన అందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.



నాకు కరోనా పాజిటివ్గా నిర్ధరణ అయింది. వ్యాధి లక్షణాలు లేవు. క్షేమంగానే ఉన్నాను. ఈ మధ్యకాలంలో నన్ను కలిసిన ప్రతి ఒక్కరూ కరోనా పరీక్షలు చేయించుకోండి. ప్రస్తుతం ఐసోలేషన్లోనే ఉండి పనిచేస్తున్నా. ఆర్బీఐ యథావిథిగానే నడుస్తుంది. నేను డిప్యూటీ గవర్నర్లు, ఆఫీసర్లతో వీడియో కాన్ఫరెన్స్, టెలిఫోన్ ద్వారా టచ్లోనే ఉంటాను అని శక్తికాంతదాస్ అన్నారు.లాక్డౌన్ తర్వాత కుంటుపడిన ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు పలు చర్యలు తీసుకున్నారు శక్తికాంతదాస్. సంప్రదాయ, అసాధారణమైన ద్రవ్య విధాన నిర్ణయాలను తీసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: