బిహార్​ ఎన్నికల ప్రచారం వాడివేడిగా జరుగుతోంది. బిహార్ అధికార, ప్రతిపక్ష పార్టీలపై తీవ్ర విమర్శలు గుప్పించారు ఏఐఎంఐఎం చీఫ్​​ అసదుద్దీన్ ఓవైసీ. పౌర సవరణ చట్టం(సీఏఏ), జాతీయ పౌర పట్టిక(ఎన్​ఆర్​సీ)ల కంటే నిరుద్యోగం, ఆరోగ్యం, విద్య వంటి సమస్యలపై దృష్టిసారించాలని ధ్వజమెత్తారు.సీఏఏ, ఎన్​ఆర్​సీలను అమలు చేస్తామని మోదీ సర్కారు చెప్పినప్పుడు... ఆర్​జేడీ మౌనంగా ఉంది. బిజేపి మిత్రపక్షం జేడీ(యూ) ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తుంది.


ఈ రెండింటి వల్ల ముస్లింలు, దళితులు ఇబ్బందిపడటమే కాకుండా, భారత జనాభాలో 50 శాతం మంది ప్రభావితమవుతారని ఓవైసీ అన్నారు. 'అసోంను ఉదాహరణ తీసుకుంటే.. ఎన్ఆర్​సీలో జాబితా 20లక్షల మందిని గుర్తించలేదు. అందులో ముస్లింలు కేవలం 5 లక్షల మందే ఉండగా.. మిగిలిన 15 లక్షల మంది హిందువులే' అని ఓవైసీ వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: