అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో, రక్షణ మంత్రి మార్క్ ఎస్పర్ భారత్​కు సోమవారం విచ్చేయనున్నారు. భారత్, అమెరికా మంత్రుల మంగళవారం జరిగే 2+2 చర్చల్లో ఇరువురు పాల్గొననున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు వారం రోజుల సమయం మిగిలుండటం, సరిహద్దులో భారత్-చైనా ఉద్రిక్తతల మధ్య జరగనున్న ఈ భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది.


ఈ సమావేశాలు భారత్, అమెరికా మధ్య జరగనున్న మూడో 2+2 చర్చలు కావడం విశేషం. భారత్​ తరపున విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్ ఈ చర్చల్లో పాల్గొంటారు. కీలకమైన ద్వైపాక్షిక అంశాలతో పాటు, ప్రాంతీయ, అంతర్జాతీయ విషయాలపై నేతలు చర్చించనున్నారు. ఇండో పసిఫిక్​లో చైనా దురాక్రమణ యత్నాలు, తూర్పు లద్దాఖ్​లో దుందుడుకు వైఖరి ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: