చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ భారత సైనిక కమాండర్ల భేటీకి రంగం సిద్ధమైంది. నాలుగు రోజుల పాటు జరిగే ఈ ద్వైవార్షిక సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. సరిహద్దులో ప్రస్తుత పరిస్థితులు సహా వ్యయాలను తగ్గించేందుకు వస్తున్న ప్రతిపాదనపై సైనికాధికారులు చర్చించనున్నారు.


అక్టోబర్​ 26 నుంచి 29 వరకు ఢిల్లీలో ఈ సమావేశం జరగనుంది. సైన్యంలోని అత్యున్నత అధికారులు ఈ భేటీకి హాజరుకానున్నారు. భారత ఆర్మీ ఉప అధిపతి, కమాండర్లు, సైనిక ప్రధాన కార్యాలయ ప్రిన్సిపల్ స్టాఫ్ అధికారులు, ఇతర సీనియర్ అధికారులు ఇందులో పాల్గొనున్నారు.మొదటి రోజు భేటీలో మానవ వనరుల అంశంపైనే ప్రధానంగా చర్చించనున్నట్లు అధికారులు తెలిపారు. అక్టోబర్ 27న రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్ భేటీలో ప్రసంగించనున్నారు. త్రిదళాధిపతి జనరల్ బిపిన్ రావత్, సైన్య, నావిక, వాయుసేన అధిపతులు సైతం సమావేశంలో పాల్గొననున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: