కర్నూలు జిల్లాలో కరోనా కేసులు ఏ మాత్రం కూడా కట్టడి కావడం లేదు. దీనితో ఏపీ సర్కార్ చాలా వరకు  జాగ్రత్తగా వ్యవహరిస్తుంది. ముఖ్యంగా ఆలూరు నియోజకవర్గంలో కరోనా కేసులు తీవ్ర స్థాయిలో ఉన్న నేపధ్యంలో కొన్ని ప్రాంతాల్లో లాక్ డౌన్ కూడా విధించడం జరిగింది. ఇక ఇదిలా ఉంటే తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. నేడు దేవరగట్టులో కర్రల సమరం రద్దు చేసారు.

కరోనా కారణంగా కర్రల యుద్ధం రద్దు చేస్తూ కలెక్టర్‌ ఆదేశాలు ఇచ్చారు. అయితే యువకులు మాత్రం కర్రల సమరం నిర్వహిస్తామని అంటున్నారు. దేవరగట్టు పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్‌ విధించారు. దేవరగట్టుకు బయటి వ్యక్తులకు నో ఎంట్రీ అని స్పష్టం చేసారు. దేవరగట్టులో పూజా కార్యక్రమాలకు మాత్రమే అనుమతి ఇచ్చారు. దేవరగట్టు పరిసర గ్రామాల్లో మద్యం అమ్మకాలు నిషేధం విధించారు. అర్ధరాత్రి మాలమల్లేశ్వర స్వామి కల్యాణోత్సవం జరగనుంది

మరింత సమాచారం తెలుసుకోండి: