తెలంగాణాలో కరోనా కేసులు బాగా తగ్గాయి. కరోనా కట్టడి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సమర్ధవంతంగానే పని చేస్తుంది. తాజాగా తెలంగాణాలో కరోనా కేసులు చాలా తక్కువగా నమోదు అయ్యాయి. తెలంగాణలో గత 24 గంటల్లో 582 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి అని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఇక నిన్న రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే... 1,432 మంది రికవరీ అయ్యారు.

కేవలం రాష్ట్రంలో కరోనా బారిన పడి నిన్న నలుగురు  మాత్రమే ప్రాణాలు కోల్పోయారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు 2,31,834కి  కి చేరుకున్నాయి అని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. హైదరాబాద్ లో కరోనా కేసులు కాస్త తగాయి అనే చెప్పాలి. 2,11,912 మంది రికవరీ అయ్యారు. ఇక రాష్ట్రంలో కరోనా బారిన పడి ఇప్పటి వరకు 1311 మంది మృతి చెందారు అని ప్రభుత్వం  పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: