జనసేన అధినేత పవన్ కళ్యాన్ ఢిల్లీ పర్యటనకు వెళ్ళే అవకాశాలు ఉండవచ్చు అని రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. వచ్చే నెల మొదటి వారంలో ఆయన ఢిల్లీ పర్యటనకు వెళ్లి  ఏపీలో వరద విషయంలో ఒక నివేదిక కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే జనసేన పార్టీ నేతలు వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించి వాస్తవ పరిస్థితిని తెలుసుకున్నారు. ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వరద నష్టాన్ని అంచనా వేస్తున్నారు.

త్వరలోనే మరికొన్ని జిల్లాల్లో కూడా పర్యటించే అవకాశం ఉంది. ఇక హైదరాబాద్  లో కూడా జనసేన పార్టీ బృందం పర్యటన చేసి నష్టాన్ని అంచనా వేసే అవకాశం ఉంది. త్వరలోనే నివేదికను కేంద్ర ప్రభుత్వ పెద్దలకు పవన్ సమర్పిస్తారు. హోం మంత్రి అమిత్ షా,  ఆర్ధిక  శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ తో ఆయన సమావేశమయ్యే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: