ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమల విషయంలో సిఎం జగన్ చాలా వరకు కూడా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. పరిశ్రమలను నెలకొల్పోయే దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు. తాజాగా నేడు సిఎం జగన్ కీలక అడుగు వేయనున్నారు. సీఎం క్యాంప్ కార్యాలయం లో ఎస్సీ, ఎస్టీ ఇండస్ట్రియల్ పాలసీ ని సిఎం  జగన్ విడుదల చేసారు. కడప స్టీల్ ప్లాంట్ పై ఉన్నతాధికారులతో సమీక్ష చేయనున్న సీఎం... కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

కడప జిల్లా కొప్పర్తి లో తలపెట్టిన ఎలక్ట్రానిక్ మాన్యు ఫాక్చరింగ్ క్లస్టర్ పై ఉన్నతాధికారులతో సమావేశం అయ్యారు  సీఎం . మధ్యాహ్నం 3 గంటలకు పార్టీ ముఖ్య నేతలు, కీలక నేతలతో సమావేశం కానున్నారు ఆయన. పొలవరం ప్రాజెక్టు, స్థానిక ఎన్నికల తో పాటు పలు కీలక అంశాలపై సిఎం జగన్ చర్చించే అవకాశం ఉందని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: