హైదరాబాద్ లో శామీర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది.  అధియాన్ అనే 5 సంవత్సరాల బాలుడిని కిడ్నాప్ చేసిన యువకుడు హత్య చేసినట్టుగా తెలుస్తుంది. ఈ నెల 15 న కిడ్నాప్ కి గురైన బాలుడు... విషయంలో పోలీసుల తీరుపై విమర్శలు వస్తున్నాయి. ఫిర్యాదు చేసినా పోలీసులు పెద్దగా పట్టించుకోలేదు. అదే ఇంట్లో కిరాయికి ఉండి బాలుడిని కిడ్నాప్ చేసాడు యువకుడు. బాలుడిని చంపినట్టు ఒప్పుకున్న యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 అధియాన్   ఆటో డ్రైవర్ కుమారుడు అని పోలీసులు పేర్కొన్నారు. ఇంటి నుంచి బయటికి వెళ్లిన బాలుడు కనపడకపోవడంతో అదే రోజు పోలీసులకు ఫిర్యాదు చేసాడు బాలుడి తండ్రి. అసలు ఎందుకు కిడ్నాప్ చేసారు ఏంటీ అనే దానిపై ఇప్పుడు పోలీసులు ఆరా తీస్తున్నారు. అతనికి ఎవరు అయినా సహకరించారా అనే దాని మీద కూడా ఆరా తీస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: