ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు అక్రమ కట్టడాల విషయంలో  చాలా వరకు ఏపీ సర్కార్ దూకుడుగా ఉన్న సంగతి తెలిసిందే. ఎవరు అయినా సరే సహించే ప్రశ్నే లేదని ఏపీ  సర్కార్ స్పష్టం చేస్తుంది. తాజాగా గీతం యూనివర్సిటి ని టార్గెట్ చేస్తూ ఏపీ సర్కార్ అక్రమ కట్టడాల కూల్చివేత చేపట్టింది. అయితే దీనిపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా దీనిపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తన ట్విట్టర్ లో మండిపడ్డారు.

“ఇలాంటి వ్యక్తి 14 ఏళ్లు సిఎంగా ఉన్నాడంటే భవిష్యత్తు తరాల వారు నమ్మడం కష్టం. వందల కోట్ల ప్రభుత్వ భూమిని ఎవరైనా ఆక్రమిస్తే ‘అలా వదిలేస్తారా’ అని నిలదీయాల్సిన పెద్ద మనిషి ‘కూల్చేస్తారా’ అని ప్రశ్నిస్తున్నాడు. తన బంధువులు కబ్జా చేయొచ్చు కాని, పేదలకు ఇళ్ల స్థలాలివ్వకూడదంట!” అని ఆయన తన ట్విట్టర్ లో ప్రశ్నించారు.”

మరింత సమాచారం తెలుసుకోండి: