విజయాలు, ఓటములతో అటు ఇటు కాకుండా ఆడుతున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీం పరిస్థితి ఇప్పుడు కాస్త ఆశ్చర్యంగా ఉంది. ఆ జట్టు కీలక బౌలర్ నవదీప్ సైని గాయం బారిన పడ్డాడు. ఇన్నింగ్స్ 18 వ ఓవర్లో  అతను బౌలింగ్ చేస్తున్న సమయంలో చేతికి బలమైన గాయం అయింది. బోటని వేలుకి తీవ్ర గాయం  కావడంతో వెంటనే అతనికి కుట్లు కూడా వేసారు.

 ప్రస్తుతం అతను ఆ గాయం నుంచి కోలుకుంటున్నాడు అని జట్టు వైద్యుడు చెప్పాడు.  అతను వచ్చే మ్యాచ్ లో ఆడే అవకాశం ఉందా లేదా అనే దానిపై తాము ఏ విధమైన స్పష్టత ఇవ్వలేము అని చెప్పాడు. ప్రస్తుతం అతని వేలి పరిస్థితిపై వైద్యులు పరిక్షలు చేస్తున్నారు అని, ఆ తర్వాత మాత్రమే చెప్తామని అన్నాడు. కాగా నిన్న చెన్నై మీద బెంగళూరు ఓడిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: