చిత్తూరు టీడీపీ నాయకుల అక్రమ అరెస్టులను ఖండించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేసారు. టీడీపీ నాయకుల గృహ నిర్భంధాలను ఖండించిన చంద్రబాబు... హంద్రీ-నీవా పనులపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ రామకుప్పం నుంచి టీడీపీ మహాపాదయాత్ర అడ్డుకోవడం అప్రజాస్వామికం అని మండిపడ్డారు. రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెస్తున్న టీడీపీపై అణచివేత చర్యలను ఖండిస్తున్నా అన్నారు.

టీడీపీ ప్రభుత్వ హయాంలో పులివెందులకు నీళ్లిచ్చి చీనీ చెట్లు ఎండిపోకుండా కాపాడాం అన్నారు. అలాంటిది ఇప్పుడు కుప్పం నియోజకవర్గంపై ప్రభుత్వ కక్షసాధింపు చర్యలను గర్హిస్తున్నాం అని మండిపడ్డారు.  తక్షణమే టీడీపీ నాయకులపై గృహనిర్బంధం ఎత్తివేయాలన్నారు. అక్రమ కేసులను తొలగించాలి అని డిమాండ్ చేసారు.  రైతాంగ వ్యతిరేక చర్యలకు వైసీపీ స్వస్తి చెప్పాలి అని డిమాండ్ చేసారు. కుప్పం రైతుల సాగునీటి సమస్యలు, తాగునీటి ఎద్దడి తక్షణమే పరిష్కరించాలన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: