ఉభయ గోదావరి జిల్లాలతో పాటుగా కృష్ణా గుంటూరు జిల్లాల్లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వరుసగా పర్యటనలు చేస్తూ వరద నష్టాలను  పరిశీలిస్తున్నారు.  గత 10 రోజుల నుంచి ఆయన వరుసగా పర్యటనలు చేస్తూనే ఉన్నారు. తాజాగా ఆయనకు ఒక ప్రమాదం ఎదురైంది. ఆకివీడు మండలం సిద్ధాపురం వద్ద వరదల వలన పాడైన చేపలను పరిశీలించిన లోకేష్.. మత్స్యకారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.

అయితే ఆకివీడు మండలం సిద్ధాపురం వద్ద లోకేష్ కు  ప్రమాదం తప్పింది. ఆయన నడుపుతున్న ట్రాక్టర్ అదుపు తప్పి ఉప్పుటేరు కాల్వలోకి వెళ్ళింది. అప్రమత్తమై... వెంటనే ట్రాక్టర్ ను అదుపుచేసి, నారా  లోకేష్ ను ట్రాక్టర్ నుంచి  అక్కడి స్థానిక టీడీపీ నేతలు దించారు. ఈ ప్రమాదంలో లోకేష్ కి ఏ విధమైన గాయాలు కాలేదు అని అధికారులు పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: