బిహార్​ ఎన్నికల్లో నిరుద్యోగంతో పాటు ఉల్లగడ్డల ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం కూడా ప్రధాన అంశాలుగా మారినట్లు పేర్కొన్నారు రాష్ట్రీయ జనతా దళ్​(ఆర్​జేడీ) నాయకుడు, మహాకూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వీ యాదవ్​. సీఎం నితీశ్​ కుమార్​ నాయకత్వంలో రాష్ట్రంలో రూ.30వేల కోట్ల విలువైన 60 కుంభకోణాలు జరిగాయని ఆరోపించారు.తాము అధికారంలోకి వస్తే 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామనే హామీ తర్వాత.. ధరల పెరుగుదలను ప్రధాన అస్త్రంగా చేసుకున్నారు తేజస్వీ. ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.


రాష్ట్రంలో విపత్తుల సమయంలో ఖర్చు చేస్తున్న నిధులపై ఆడిట్​ జరగటం లేదని, అవినీతి పెరిగిపోయిందని ఆరోపించారు తేజస్వీ. లంచం లేకుండా ఏ పని జరగటం లేదన్నారు. ఆ సంప్రదాయాన్ని నితీశ్​ జీ రూపొందించారని విమర్శించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: