మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి అజిత్​ పవార్ కరోనా బారిన పడ్డారు. సోమవారం నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్​గా తేలింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే తెలిపారు. ప్రస్తుతం పవార్​ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్​ తోపె తెలిపారు.

నాకు కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయ్యింది. ప్రస్తుతం నా ఆరోగ్యం నిలకడగానే ఉంది. వైద్యుల సలహా మేరకు బ్రీచ్​ క్యాండీ ఆసుపత్రిలో చేరాను. పార్టీ కార్యకర్తలు, రాష్ట్ర ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొన్నిరోజుల విశ్రాంతి తరువాత వస్తాను అని అజిత్ పవార్ తెలిపారు.దేశంలో తాజాగా 45వేలకుపైగా కేసులు వెలుగుచూశాయి. మరో 480మంది మరణించారు. దీంతో కేసుల సంఖ్య 79,09,960 కు చేరగా.. మృతుల సంఖ్య 1,19,014కు పెరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: