ఢిల్లీలో వాయు కాలుష్యానికి కారణమవుతున్న హరియాణా, పంజాబ్, ఉత్తర్​ప్రదేశ్ రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దహన నివారణ చర్యలు తీసుకునేందుకు ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిటీని రద్దు చేసింది సుప్రీంకోర్టు. కాలుష్యాన్ని అరికట్టడానికి కేంద్రం సమర్థమైన చట్టం తీసుకురానుందని సొలిసిటర్​ జనరల్​ తుషార్​ మెహతా.. కోర్టుకు తెలియజేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది ధర్మాసనం.


కాలుష్యం వల్లే ఢిల్లీ ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. ఇది తక్షణమే నివారించాల్సిన అవసరం ఉంది' అని ధర్మాసనం పేర్కొంది.కాలుష్య నివారణకు కేంద్రం సమర్థమైన చర్యలు తీసుకుంటోందని... దానికి సంబంధించి ప్రతిపాదిత డ్రాఫ్ట్​ను నాలుగు రోజుల్లో కోర్టు సమర్పిస్తాం' అని కోర్టుకు విన్నవించారు మెహతా.

మరింత సమాచారం తెలుసుకోండి: