జమ్ముకశ్మీర్​లో జరిగిన ఎన్​కౌంటర్​లో గుర్తు తెలియని ఉగ్రవాదిని మట్టుబెట్టాయి భద్రతా దళాలు. పుల్వామా జిల్లాలోని నూర్​పురా, అవంతిపురా ప్రాంతాల్లో ఉగ్రవాదులు దాగి ఉన్నారన్న సమాచారంతో.. జమ్ముకశ్మీర్​ పోలీసులు, భద్రతా దళాలు సంయుక్తంగా తనిఖీ చేపట్టాయి.

ఈ సమయంలో భద్రతా దళాలకు తారసపడిన ఉగ్రవాది.. వారిపైకి కాల్పులకు తెగబడ్డాడు. ఈ నేపథ్యంలో భద్రతా దళాలు జరిపిన ఎదురుకాల్పుల్లో ఉగ్రవాది హతమయ్యాడని ఆర్మీ అధికారులు తెలిపారు. ఉగ్రవాదుల కోసం చేపట్టిన ఆపరేషన్​ ఇంకా కొనసాగుతున్నట్లు వెల్లడించారు.జమ్ముకశ్మీర్​లోని పుల్వామా జిల్లాలో భద్రతా దళాలు జరిపిన ఎదురుకాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. నూర్​పురా, అవంతిపురా ప్రాంతాల్లో తనిఖీలు కొనసాగుతున్నట్లు ఆర్మీ అధికారులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: