అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆ దేశ విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో భారత్‌తో కీలక చర్చలకు సిద్ధమయ్యారు. దిల్లీలో 2+2 పద్ధతిలో జరిగే సమావేశాల్లో ఇరు దేశాలు కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. విదేశాంగ శాఖ, రక్షణ శాఖ మంత్రులు తమకు సమాన హోదా కలిగిన వ్యక్తులతో భేటీ అవుతారు. భారత్‌ తరపున రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, విదేశాంగ మంత్రి జైశంకర్‌ ఈ చర్చల్లో పాల్గొంటారు. ముఖ్యంగా రక్షణ పరమైన అంశాలు, విదేశాంగ విధానాలపై సమావేశంలో ఎక్కువగా చర్చిస్తారు.



ఈ భేటీలో లద్దాఖ్‌‌లో ఉద్రిక్త పరిస్థితి నెలకొనడం వల్ల భారత్‌ భద్రతాపరమైన అంశాలపై ఎక్కువగా దృష్టిపెట్టే అవకాశం ఉంది. భారత్‌-అమెరికా మధ్య పరస్పర అవసరాల కోసం సమన్వయం పెంచుకోవడం.. అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలపై దృష్టిపెట్టడం ఈ చర్చల ముఖ్య లక్ష్యమని అధికారులు తెలిపారు. పాంపియో, ఎస్పర్‌ తమ పర్యటనలో భాగంగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్‌తోనూ భేటీ కానుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: