పశ్చిమ్ బంగలో దుర్గా దేవీ విగ్రహ నిమజ్జనంలో అపశ్రుతి చోటు చేసుకుంది. విగ్రహాన్ని తీసుకెళ్తున్న రెండు నాటు పడవలు నీటిలో మునిగిపోయాయి. సోమవారం జరిగిన ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ముర్షిదాబాద్​ జిల్లా బెల్దంగలో ఈ ఘటన జరిగింది.ఐదుగురి మృతదేహాలను నీటిలో నుంచి వెలికితీసినట్లు పోలీసులు తెలిపారు.


సాయంత్రం 5:15 గంటలకు ప్రమాదం జరిగిందని చెప్పారు. రెండు పడవల్లో 20 మంది ప్రయాణించినట్లు చెప్పారు.మరిన్ని మృతదేహాల కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు చెప్పారు పోలీసులు. విపత్త నిర్వహణ శాఖ సమన్వయంతో పనిచేస్తున్నట్లు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: