మహిళా అభ్యర్థిపై అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్న మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్​నాథ్​ను ఈసీ మందలించింది. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్నప్పుడు అలాంటి వ్యాఖ్యలు చేయొద్దని సూచించింది. నియంత్రణతో వ్యవహరించాలని హితవు పలికింది.గతవారం గ్వాలియర్​లో జరిగిన ఎన్నికల ప్రచారంలో భాగంగా బిజేపి నేతను 'ఐటం' అని పేర్కొన్నారు కమల్​నాథ్. దీనిపై ఈసీ నోటీసులు జారీ చేయగా... బిజేపి తన వ్యాఖ్యలను వక్రీకరించిందని వివరణ ఇచ్చారు.


మరోవైపు బిజేపి నేత కైలాశ్ విజయ్​వర్గియాకు ఈసీ నోటీసులు జారీ చేసింది. కాంగ్రెస్ నేతలు దిగ్విజయ్ సింగ్, కమల్​నాథ్​ లక్ష్యంగా చేసిన 'చున్ను-మున్ను' వ్యాఖ్యలపై వివరణ కోరింది. 48 గంటల్లోగా స్పందించాలని సోమవారం నోటీసులో పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: