తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వ టార్గెట్ గా తీవ్ర విమర్శలు చేసారు. సీపీ జోయల్ డేవిస్ టీఆర్ఎస్ కార్యకర్త అని తీవ్ర విమర్శలు చేసారు. సీపీ భార్యను, పిల్లలను తనిఖీ చేస్తే తెలిసేదని... సీఎం కేసీఆర్ భార్యను, పిల్లలను తనిఖీ చేస్తే ఊరుకుంటారా అని నిలదీశారు. సీఎం కేసీఆర్‌ కు దమ్ము ధైర్యం లేదని ఆయన అన్నారు. ఓటమి భయంతో పిచ్చి పనులు చేస్తున్నారని సంజయ్ తీవ్ర విమర్శలు చేసారు.

తాను నిరాహార దీక్ష కొనసాగిస్తానని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. దుబ్బాకకు వస్తున్న డబ్బులు కేసీఆర్ ఫామ్ హౌస్ వే అని ఆయన అన్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్‌ ను తనిఖీ చేయాలని డిమాండ్ చేసారు. కాగా నిన్న సాయంత్రం బండి సంజయ్ పై దాడి చేసారు అనే ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. దుబ్బాక బీజేపీ అభ్యర్థి  రఘునందన్‌రావు బంధువుల ఇళ్లలో పోలీసుల సోదాలు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: