జమ్ము కాశ్మీర్ లో ఉగ్రవాదుల కదలికలు ఏదోక విధంగా ఉంటూనే ఉన్నాయి. ఉగ్రవాద కార్యాకలాపాలను అదుపులోకి తీసుకురావడానికి భారత బలగాలు ప్రయత్నాలు  చేస్తున్నా సరే అవి అంతగా ఫలించడం లేదు అనే చెప్పాలి. అయితే కొంత మంది ఉగ్రవాదులు మాత్రం ఇప్పుడు లొంగిపోతున్నారు. సరిహద్దుల్లో భారత బలగాలు కాస్త కఠినంగా ఉండటంతో ఉగ్రవాదులు స్వచ్చందంగా లొంగిపోవడానికి ముందుకు వస్తున్నారు.

తాజాగా ఒక వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అసలు ఈ వీడియోలో ఏముందు ఏంటీ అంటే... ఒక ఉగ్రవాది పోలీసులు లొంగిపోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ ఏడాది సెప్టెంబర్ 25 నుంచి పరారీలో ఉన్న పుల్వామాలోని గుల్షన్‌ పురాలో నివసిస్తున్న ఒక ఉగ్రవాది నిన్న భద్రతా దళాల ముందు లొంగిపోయాడు. ఒక ఎకె 47 రైఫిల్ కూడా అతను బలగాలకు ఇచ్చేసాడు. ఈ వీడియో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: