రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మావోయిస్ట్ లు ఇప్పుడు చక్రం తిప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే వరుసగా దాడులకు కూడా వాళ్ళు పాల్పడుతున్నారు. తాజాగా ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. పోలీసులే లక్ష్యంగా మందుపాతర పేల్చారు మావోయిస్టులు. పెదబయలు సమీపంలోని ఇంజరీ అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.

ఈ దాడిలో తృటిలో తప్పించుకున్న భద్రతా బలగాలు.. వారి కోసం గాలింపు చేపట్టాయి. రెండు నెలల వ్యవధిలో రెండు సార్లు మందుపాతరలు పేల్చిన మావోయిస్టులు... పోలీసులకు సవాల్ విసిరారు. ఏవోబీలో  పోలీసుల కూంబింగ్‌ ఇంకా కొనసాగుతుంది. ఇక  ఇదిలా ఉంటే... ఏవోబీలో మావోయిస్టులు హల చల్ చేసారు. రెండు వాహనాలను దగ్ధం చేసారు.  ఒడిశా మల్కన్ గిరిజిల్లా పప్పర్లమెట్ట అటవీ ప్రాంతంలో ఘటన జరిగింది.  అప్రమత్తమైన బలగాలు.. మావోయిస్ట్ లను గుర్తించాయి. విశాఖ పోలీసులు కూడా అప్రమత్తం అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: