సిద్ధిపేట జిల్లా సీపీ జోయల్ డెవిస్ మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. పట్టణంలోని మున్సిపల్ చైర్మన్ రాజనర్స్, సురభి రామ్ గోపాల్ రావు, సురభి అంజన్ రావు ఇంట్లో సోదాలు చేయడం జరిగిందని ఆయన అన్నారు. సురభి అంజన్ రావు ఇంట్లో 18 లక్షల 67 నగదు దొరికిందని ఆయన పేర్కొన్నారు. ఆయనను ప్రశ్నించగా అయన బవమర్ది జితేందర్ రావు డ్రైవర్ ద్వారా ఎలక్షన్స్ కోసం పంపించి నట్టు  తెలిపినట్టు ఆయన మీడియాకు వివరించారు.

పంచనామా చేశాక బయటకు డబ్బు తెచ్చేముందు బీజేపి అభ్యర్థి రఘు నందన్ రావు తో ఉన్న సుమారు 20 మంది కార్యకర్తలు పోలీసుల నుండి 5 లక్షల 87 వేల డబ్బు ఎత్తుకెళ్లారు అని ఆయన పేర్కొన్నారు. మిగిలిన 12 లక్షల 80 వేలు సీజ్ చేశాం అన్నారు. ఎవరెవరు ఎత్తుకెళ్లారు వారిపై  వీడియో ఆధారంగా  చట్ట రీత్యా చర్యలు తీసుకుంటాం అని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: