ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా వస్తున్న చిత్రం ట్రిపుల్ ఆర్. ఈ సినిమాపై అప్పుడే వివాదాలు కూడా మొదలయ్యాయి. దర్శకుడు రాజమౌళికి అదిలాబాద్ ఎంపీ సోయం బాపు రావు వార్నింగ్ ఇచ్చారు. ఆర్.ఆర్.ఆర్ మూవీలో భీం పాత్రకు పెట్టిన టోపీ తొలగించాలి అని ఆయన డిమాండ్ చేసారు. అలాగే విడుదల చేస్తే థియేటర్లను తగుల బెట్టె అవకాశం ఉంది అని ఆయన అన్నారు.

మీ కలెక్షన్ల కోసం  మా ఆరాధ్య దైవాన్ని కించ పరిస్తే సహించబోము అని ఆయన స్పష్టం చేసారు. నైజాం కు వ్యతిరేకంగా కొమురం భీం పోరాటం చేసి అమరుడయ్యారన్నారు. భీం ను చంపిన వాళ్ళ  టోపీ ఆయనకు పెట్టడం ఆదివాసులను  అవమానించడమే అన్నారు. రాజమౌళి ఇప్పటికైనా చరిత్ర ను తెలుసుకోవాలి, లేకుంటే మర్యాద ఉండదని ఆయన స్పష్టం చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: