హర్యానాలోని ఫరీదాబాద్ జిల్లాలో దారుణ ఘటన ఒకటి జరిగింది. 21 ఏళ్ల యువతిని ఆమె కాలేజ్ బయట కాల్చి చంపారు. సోమవారం ఈ ఘటన జరిగింది. ఫరీదాబాద్ బల్లబ్‌ గర్ ‌లో ఓ మహిళ పరీక్షకు హాజరైన తర్వాత కాలేజీ నుంచి బయటకు వచ్చినప్పుడు ఈ సంఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. ముందు ఆమెను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించగా ఆమె ప్రతిఘటించింది.

ఫరీదాబాద్  జిల్లా ఎస్పీ మీడియాకు తెలిపారు. బాధితురాలిని ఆసుపత్రికి తరలించినప్పటికీ ఆమె అప్పటికే ప్రాణాలు కోల్పోయింది. నిందితుల్లో ఒకరిని మంగళవారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని మేవాట్ నివాసిగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలికి, నిందితుల్లో ఒకరికి  తెలుసునని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి ఈ విషయంపై దర్యాప్తు జరుపుతున్నామని జిల్లా ఎస్పీ చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: