టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ తీవ్ర విమర్శలు చేసారు. రైతు భరోసా పేరుతో రైతు దగా చేస్తున్నారు అని ఆరోపించారు. రూ.1.50లక్షలిచ్చిన వారిని విమర్శించి.. రూ.7,500 ఘనమని ప్రచారం చేస్తున్నారని అన్నారు. రైతు ద్రోహానికి జగన్ రెడ్డి కేరాఫ్ అడ్రస్ అని మండిపడ్డారు. తడిగుడ్డతో గొంతు కోస్తూ.. రైతు భరోసా పేరుతో హడావుడి చేస్తున్నారన్నారు. టీడీపీ హయాంలో 63లక్షల మంది రైతులకు లబ్ది జరిగిందని తెలిపారు.

నాడు కోటి మంది రైతులంటూ ప్రకటన.. నేడు అంతా తూచ్ అన్నారు. 50లక్షల మంది రైతులు అంటూ.. దగా అని ఆయన విమర్శించారు. 15లక్షలకు పైగా ఉన్న కౌలు రైతుల్ని విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేసారు. గిరిజనులు, కౌలు రైతులు కేవలం లక్ష మందే అంటూ ప్రకటన చేసారని... ఇచ్చేది రూ.7,500 ప్రచారం రూ.13,500 అని ఆరోపించారు.  వరదలతో లక్షలాది ఎకరాల్లో పంటలు మునిగితే కనీసం పరామర్శించలేదని మండిపడ్డారు. అమరావతి రైతులపై పెయిడ్ ఆర్టిస్టులతో తప్పుడు కేసులు పెట్టారన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: