వికారాబాద్ అడవుల్లో కాల్పుల ఘటనలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. దామగుండంలో ఓ ప్రముఖ క్రీడాకారిణికి, ఆమె బంధువులకు ఫామ్ హౌజ్ లు ఉన్నాయి అని పోలీసులు గుర్తించారు. అయితే స్థానికులు కొత్త ఆరోపణ ఒకటి చేసారు. ఫాం హౌజ్ కు వస్తున్న వారే కాల్పులు జరుపుతున్నారని ఆరోపించారు. దీనితో ఫామ్ హౌజ్ నిర్వాహకులు, సిబ్బందిని పోలీసులు గంట పాటు విచారించారు.

స్థానికులను ఫామ్ హౌజ్ నిర్వకులు బెదిరిస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఫామ్ హౌజ్ దరిదాపుల్లోకి పశువులు తీసుకొని రావద్దు అంటూ స్థానికులను వారు బెదిరిస్తున్నారని పోలీసులకు తెలిసింది. కాల్పుల ఘటన పై పోలీసులు కీలక సమాచారం సేకరించారు. స్వాధీనం చేసుకున్న బుల్లెట్ ఏ రివాల్వర్ నుంచి వచ్చిందో దర్యాప్తు చేస్తున్నారు. ఆవు యజమానిని ఘటన జరిగిన మరుసటి రోజు అక్కడ ఉన్న వారు బెద్రించారు. ఫామ్ హౌజ్ కు చెందిన వారే కాల్పులకు పాల్పడి ఉంటారని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: