ఆంధ్రప్రదేశ్ సిఎం వైఎస్ జగన్ రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు. రెండో విడత రైతు భరోసా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.  50 లక్షల మంది రైతులకు రైతు భరోసా అందిస్తున్నారు. పెట్టుబడి సాయంతో పాటుగా ఇన్ పుట్ సబ్సిడీ ఏపీ సర్కార్ అందిస్తుంది. రెండు విడతల్లో 11 వేల 500 సాయం చేస్తుంది ఏపీ సర్కార్. ఈ సందర్భంగా సిఎం జగన్ మాట్లాడుతూ ఏ వివక్షా లేకుండా రైతు భరోసా అందిస్తున్నామని అన్నారు.

రైతు భరోసా కేంద్రాల ద్వారా పంట నేరుగా కొనుగోలు చేస్తున్నామని జగన్ అన్నారు. కరోన కాలంలో కూడా రైతులకు అండగా నిలబడ్డామని జగన్ పేర్కొన్నారు. వరదలపై విపక్షాలు చేస్తున్న రాజకీయం చాలా బాధాగా ఉందని అన్నారు. ప్రతీ ఒక్కరికి కూడా తాము న్యాయం చేస్తామని సిఎం జగన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: