కొడుకు కోసం తపనతో ఎనిమిది నుండి తొమ్మిది మంది పిల్లలను కన్నారు అని ఎన్నికల ర్యాలీలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్... prasad YADAV' target='_blank' title='లాలూ ప్రసాద్ యాదవ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>లాలూ ప్రసాద్ యాదవ్ పేరు ప్రస్తావించకుండా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీనిపై రాష్ట్ర జనతాదళ్ (ఆర్జెడి) నాయకుడు తేజశ్వి యాదవ్ తీవ్రంగా స్పందించారు. మాజీ ముఖ్యమంత్రులు లాలూ యాదవ్, రాబ్రీ దేవి తొమ్మిది మంది పిల్లలలో ఎనిమిదవ సంతానం తేజశ్వి యాదవ్.

 ఆయన ఈ మేరకు సోషల్ మీడియాలో స్పందించారు. నితీష్ కుమార్ అవమానాలు కూడా తనకు "దీవెనలు" అని ఆయన పేర్కొన్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి మహిళలను, నా తల్లి మనోభావాలను అవమానించారని చెప్పారు. "ఎవరైనా పట్టించుకున్నారా? వారికి ఎనిమిది-తొమ్మిది మంది పిల్లలు ఉన్నారు. వారికి కుమార్తెలపై నమ్మకం లేదు. చాలా మంది కుమార్తెల తరువాత, వారికి ఒక కుమారుడు ఉన్నాడు అంటూ ఆయన విమర్శలు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: