ఓటుకు నోటు కేసు పై ఏసీబీ కోర్ట్ విచారణ జరిపింది. తమ పేర్లు తొలగించాలని సండ్ర వెంకట వీరయ్య, ఉదయ సింహా డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలు చేసారు. ఏసీబీ ధాఖలు చేసిన కౌంటర్ పిటీషన్ల పై విచారణ చేపట్టిన ఏసీబీ కోర్ట్... ఇరు వర్గాల వాదనలు విన్నది. నిందితులు ధాఖలు చేసిన డిశ్చార్జ్ పిటీషన్ లను అనుమతించవద్దని వాదనలు వినిపించారు ఏసీబీ తరపు న్యాయవాది.

నిందితుల ఆడియో, వీడియో లు స్పష్టంగా ఉన్నాయని కోర్టుకు ఏసీబీ ఈ సందర్భంగా సష్టం చేసింది. తప్పు చేసి కేసుల నుండి తప్పించుకోవడానికి డిశ్చార్జ్ పిటీషన్ దాఖలు చేశారని ఏసీబీ ఈ సందర్భంగా ఆరోపించింది. నిందితుల తరపు వాదనలకు కేసు విచారణ రేపటికి అవినీతి నిరోధక శాఖ కోర్ట్ వాయిదా వేసింది. కాగా ఈ కేసులో రేవంత్ రెడ్డి కూడా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: