కృష్ణా జిల్లా  నందిగామ నందిగామలో మంత్రి కొడాలి నానీ మీడియాతో మాట్లాడారు. లోకేష్ పై కాస్త దూకుడుగా  వ్యాఖ్యలు చేసారు. దొంగలు పడిన ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్టు గా ఉంది అని ఆయన ఆరోపించారు. వరదలు ఎప్పుడు వచ్చాయి, ఎప్పుడు పరిశీలిస్తున్నారు అని ఆయన ప్రశ్నించారు. మొదటి ట్రిప్పు తలకాయ ఉన్న వాడు కొల్లేరులో పెట్టుకుంటారా అని ప్రశ్నించారు.

లోకేష్ ఆఫ్ నాలెడ్జ్ పార్టీ నడపడం రాదు ,ట్రాక్టర్ నడపడం రాదు  అని అన్నారు. తెలుగుదేశం పార్టీ కూడా లోకేష్ నాయకత్వంలో కొల్లేటి లో ట్రాక్టర్ ఏ విధంగా దించాడు టీడీపీని కూడా దించుతాడు అని ఆయన ఎద్దేవా చేసారు. బుద్ధి ఉన్నోడు ముందుగా దిగిపోండి ట్రాక్టర్ నుండి పార్టీ నుండి అంటూ ఆయన వ్యాఖ్యానించారు. లోకేష్ గురించి ఎక్కువగా మాట్లాడటం పరమ వేస్ట్ అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: