మహబూబాబాద్ జిల్లాలో జరిగిన కిడ్నాప్ వ్యవహారానికి సంబంధించి పోలీసుల విచారణ జరుగుతుంది. దీక్షిత్ కిడ్నాప్, హత్య కేసు కి సంబంధించి కీలక విషయాలను రాబట్టే దిశగా పోలీసులు అడుగులు వేస్తున్నారు. నిందితుడు మంద సాగర్  ని నాలుగు రోజుల కస్టడీకి కోర్ట్ అనుమతించింది. ఐదు రోజుల  కస్టడీ కావాలంటూ కోర్టులో పిటిషన్ వేసారు పోలీసులు.  అయితే కోర్ట్ మాత్రం నాలుగు రోజుల  కస్టడీకి అనుమతి ఇచ్చింది.

నేటి నుంచి ఈ నెల 31 వరకు కస్టడీకి అనుమతి ఇచ్చింది.  మహబూబాబాద్ సబ్ జైల్ నుంచి కాసేపట్లో నిందితుడు సాగర్ ని కస్టడీ లోకి  పోలీసులు తీసుకునే అవకాశం ఉంది. బాలుడి హత్య వెనుక ఉన్న కారణాలు అలాగే  అసలు ఈ ఘటనలో ఎవరి ప్రమేయం అయినా ఉందా అనే దానిపై నిందితుడి నుంచి మరిన్ని వివరాలు పోలీసులు రాబట్టే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: