నిన్న దుబ్బాక, సిద్ధిపేటలో జరిగిన పరిణామాలు కాస్త హాట్ టాపిక్ గా మారాయి. ఈ పరిణామాలు ఎక్కడికి వెళ్తాయి ఏంటీ అనే దానిపై అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే తన విషయంలో పోలీసులు దురుసుగా ప్రవర్తించారు అని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దీక్షకు దిగారు. దీక్ష కొనసాగిస్తున్న ఎంపీ, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ ఆరోగ్యంపై కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఆందోళనకరంగా సంజయ్ ఆరోగ్యం ఉందని అంటున్నారు. తగ్గుతున్న షుగర్ లెవల్స్ తో ఆయన ఇబ్బంది పడుతున్నారట. దీనితో బిజెపి కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గంట, గంటకు సమాచారం తెలుసుకుంటున్న బిజెపి హై కమాండ్... ఆయనకు ఫోన్ చేసింది. పరామర్శకు కరీంనగర్ కు వివిధ స్థాయి బిజెపి నాయకులు చేరుకున్నారు. ఆయన నేడు ఉదయం దీక్ష ప్రారంభించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: