హైదరబాద్ లో డ్రగ్స్ విషయంలో పోలీసులు ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే ఎక్కడో ఒక చోట డ్రగ్స్ వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా మరోసారి డ్రగ్స్ దొరికాయి. వెస్ట్ జోన్ లో టాస్క్ ఫోర్స్ పోలీసులు డ్రగ్స్ పట్టుకున్నారు. మంగళహట్ లోని  ఆర్య సమాజ్ సమీపంలో  డ్రగ్స్ విక్రయిస్తుండగా పట్టుకున్నారు. కస్టమర్లు కు  చరస్  డ్రగ్స్ ను అమ్ముతుండగా పట్టుకున్నపోలీసులు... రిమాండ్ కి తరలించారు.

కారు డ్రైవర్  సురాజ్ సింగ్, లలిత్ కుమార్ ను అరెస్ట్ చేసారు. గంజా, చారస్ ను ధూల్పేట్, మంగళహట్ లో  అతి తక్కువ ధరకు కొనుగోలు చేసి,  సురాజ్ సింగ్ అవసరమైన వారికి అమ్మేవాడు  అని విచారణ వెల్లడి అయింది. చారస్ ఒక్కో గ్రాము 18 వందలకు విక్రయిస్తున్నట్లు దర్యాప్తు లో వెల్లడి  అయింది. నిందితులు నుండి  40 గ్రాముల చరస్  స్వాధీనం చేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: