నిన్న దుబ్బాక,సిద్దిపేట ఎపిసోడ్  అంతా చూశాం అని... ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో ఎన్నికలు జరుగుతాయి అని తెలంగాణా మంత్రి srinivas YADAV' target='_blank' title='తలసాని శ్రీనివాస్ యాదవ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఎన్నికల సందర్భంగా సోదాలు జరగడం సర్వ సాధారణం  అన్నారు. హరీష్ రావు, పద్మా దేవేందర్ రెడ్డి, సుజాత ఇంట్లో కూడా సోదాలు జరిగాయన్నారు. బీజేపీ నేతలు నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని  మండిపడ్డారు.

మీ క్యాడర్ బలం ఎంత? మా క్యాడర్ 60 లక్షలు అన్నారు. మీలా మా వాళ్ళు ముట్టడి చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండని ఆయన సవాల్ చేసారు. డబ్బులు సీజ్ చేసి తీసుకొస్తుంటే కార్యకర్తలు పోలీసుల చేతిలో నుండి లాక్కొని వెళ్లారన్నారు. 5 లక్షలు అపహరణకు గురైంది.. అది పెద్ద క్రైమ్ అన్నారు. హైద్రారాబాద్ కు వరదసాయం ఇప్పటికీ కేంద్రం నుండి రూపాయి అందలేదన్నారు. జీఎస్టీ నిధులే రాలేదని ఆయన మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: