కరోనా లాక్ డౌన్ తర్వాత  మన దేశంలో సినిమా షూటింగ్ లు మొదలైన సంగతి తెలిసిందే. సినిమా షూటింగ్ ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు పలు సూచనలతో అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా హైదరాబాద్ నిజాం కాలేజ్ లో సినిమా షూటింగ్ వివాదం అయింది. విద్యార్థులకు పరిక్షలు జరుగుతున్న తరుణంలో షూటింగ్ నిర్వహించడం పై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు విద్యార్థి సంఘం నాయకులు.

పరీక్షలు జరుగుతున్న సమయంలో నిజాం కాలేజ్ ప్రిన్సిపాల్ ఎలా అనుమతి ఇస్తారు అని వారు ప్రశ్నించారు. కరోనా నిబంధనలకు విరుద్ధంగా షూటింగ్ జరిగితుంది అని మండిపడ్డారు. వెంటనే షూటింగ్ నిలిపివేయాలని డిమాండ్ చేసారు. కాగా మన తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ప్రభుత్వాలు షూటింగ్ లకు అనుమతులు ఇవ్వగా  చాలా వరకు కూడా కరోనా జాగ్రత్తలు తీసుకునే షూటింగ్ లు నిర్వహిస్తూ వస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: