బిహార్​లో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం పతాక స్థాయికి చేరింది. అసెంబ్లీ ఎన్నికల మొదటి విడత పోలింగ్​కు ఇంకా కొన్ని గంటలే మిగిలి ఉన్న తరుణంలో విమర్శలకు పదును పెంచారు నాయకులు. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్​ యాదవ్ లక్ష్యంగా పరోక్ష విమర్శలు గుప్పించారు బిహార్ సీఎం నితీశ్​ కుమార్. 9 మంది పిల్లలను కన్నవారు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేరని ధ్వజమెత్తారు. వైశాలి జిల్లా మహ్నార్​లో నిర్వహించిన ఎన్నికల సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు.


నితీశ్ వ్యాఖ్యలపై లాలూ కుమారుడు, మహాకూటమి సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్​ తీవ్రంగా స్పందించారు. ఆయన శారీరకంగా, మానసికంగా అలసిపోయారని.. అందుకే ఇలా మాట్లాడుతున్నారని విమర్శించారు. బహుశా ఐదుగురు తోబుట్టువులున్న ప్రధాని నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకునే నితీశ్​ ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: