రైతులకు మద్దతుగా నిలిచేందుకు కేరళ ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్రంలో పండించే పంటలకు కనీస ధర నిర్ణయించింది. మొదటి దశలో 16 రకాల కూరగాయలకు ధరలను ఖరారు చేసింది. నవంబరు 1నుంచి ఇవి అమల్లోకి వస్తాయని సీఎం పినరయి విజయన్ తెలిపారు. మార్కెట్​లో అస్థిరత నెలకొన్న సమయంలో రైతులకు అండగా నిలబడేలా ఈ తరహా నిర్ణయం తీసుకున్న మొదటి రాష్ట్రం కేరళ అని ఆయన వెల్లడించారు.


మొదటి దశలో భాగంగా అరటి, బంగాళదుంప, క్యారట్, చిలకడదుంప, బెండకాయ, బూడిద గుమ్మడి, కాకరకాయ, టమాటో, పైనాపిల్​, వెల్లుల్లి, పొట్లకాయ, దోసకాయ, క్యాబెజ్​, బీట్​రూట్, చిక్కుడు వంటి కూరగాయలకు కేరళ ప్రభుత్వం కనీస ధర నిర్ణయింది. ఒకవేళ మార్కెట్ ధర.. కనీస ధర కంటే తక్కువగా ఉంటే అప్పుడు ప్రభుత్వమే రైతుల నుంచి పంటను కొనుగోలు చేస్తుంది. కూరగాయలకు కనీస ధర చెల్లిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: