ఫేస్​బుక్​ భారత పబ్లిక్​ పాలసీ హెడ్​ పదవి నుంచి అంఖీ దాస్​ తప్పుకున్నారు. ఈ మేరకు ఆ సంస్థకు చెందిన ఉన్నతాధికారి ఒకరు స్వయంగా వెల్లడించారు. గత కొంతకాలంగా విద్వేషపూరిత ప్రసంగాలు, కంటెంట్​ నిర్వహణ విషయంలో ఫేస్​బుక్​ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో దాస్​ రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.



ఫేస్​బుక్​కి రాజీనామా చేసిన అంఖీ దాస్​ ఇకపై ప్రజాసేవలోకి రానున్నట్లు వీడ్కోలు సమావేశంలో తెలిపారు. 2011లో సంస్థలో చేరినప్పటి తన అనుభవాలను నెమరు వేసుకున్నారు. దేశంలో ప్రజలను కలిపే దిశగా మేము నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకున్నట్లు తెలిపారు. ప్రపంచానికి ఓ అద్భుతాన్ని అందించిన మార్క్​ జూకర్​ బర్గ్​కి ధన్యవాదాలు తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: