దేశ ఆర్థిక స్థితిగతులపై ప్రధాని నరేంద్ర మోదీ సమీక్ష నిర్వహిస్తున్నారు. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​ ఈ సమావేశంలో ఉన్నారు. కరోనా ప్రభావంతో కుప్పకూలిన ఆర్థిక రథాన్ని మళ్లీ పరుగులు పెట్టించేందుకు మరో భారీ ప్యాకేజీ తెచ్చే అవకాశంపై చర్చిస్తున్నట్లు సమాచారం.


వివిధ రంగాల్లో ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు క్షేత్ర స్థాయిలో ఏ మేరకు ప్రభావం చూపుతున్నాయో ఆర్థిక మంత్రి.. మోదీకి వివరిస్తున్నారు.  కరోనా వైరస్​ ప్రభావం నుంచి దేశ ఆర్థిక రంగాన్ని కాపాడేందుకు మే లో రూ.20 లక్షల కోట్లతో 'ఆత్మనిర్భర్​ భారత్'​ ప్యాకేజీని ప్రకటించింది మోదీ ప్రభుత్వం.

మరింత సమాచారం తెలుసుకోండి: