ఆంధ్రప్రదేశ్ లో విద్య విషయంలో రాష్ట్ర సర్కార్ చాలా వరకు జాగ్రత్తలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అన్ని విధాలుగా కూడా పేదలకు నాణ్యమైన విద్య అందే విధంగా ఏపీ సర్కార్ చర్యలు చేపడుతుంది. ఎవరూ విద్యకు దూరం కావొద్దు అనే భావనలో సిఎం జగన్ ఉన్నారు.   గత ప్రభుత్వం కంటే కూడా ఇప్పుడు చాలా మెరుగ్గా విద్య అందుతుంది అనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. దీనిపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేసారు.

“పేదలు చదివే ప్రభుత్వ స్కూళ్ల నుంచి యూనివర్సిటీల వరకు నిధులివ్వకుండా గాలికొదిలేసి ప్రైవేటు విద్యా సంస్థలను ఎగదోశాడు. తన బంధువర్గం, పార్టీకి ఫండింగ్ చేసే కార్పోరేట్ మాఫియాకు రాష్ట్రాన్ని తాకట్టు పెట్టాడు బాబు. విద్య అనేది ప్రభుత్వ బాధ్యతే కాదని సెలవిచ్చిన ‘విజనరీ’ కదా!” అని ఆయన ట్వీట్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

mp