దేశ వ్యాప్తంగా సంచలనం అయిన వరంగల్ లో నగర శివారుల్లో జరిగిన 9 హత్యల కేసులో నేడు తుది తీర్పు వెల్లడి కానుంది. ఈ ఘటనలో ప్రధాన నిందితుడుకి నిందితుడికి ఉరి లేదా యావజ్జీవ శిక్ష పడే అవకాశం ఉంది అని తెలుస్తుంది. గత మే 21న వరంగల్ నగర శివారులోని గొర్రెకుంట సాయి దత్త గన్ని బ్యాగ్స్ కంపెనీ లో 9మందికి మత్తు ఇచ్చి సృహ కోల్పోయిన తర్వాత సజీవంగా బావిలో  పడేసి హత్య చేసాడు.

ఈ కేసులో నిందితుడు బీహార్ కి చెందిన సంజయ్ కుమార్ యాదవ్ కు నేడు శిక్ష ఖరారు చేయనుంది సెషన్స్ కోర్ట్. నిందితుడి పై 7సెక్షన్స్ కింద కేసులు నమోదు చేసారు. నెల రోజుల్లో కోర్ట్ లో చార్జ్ షీట్ దాఖలు చేసిన పోలీసులు... విచారణ వేగవంతంగా పూర్తి చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: