ఒక పక్కన కిడ్నాప్ విషయాల్లో పోలీసులు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా సరే ఎక్కడో ఒక చోట ఏదోక ఘటన వెలుగులోకి వస్తూనే ఉంది. తాజాగా హైదరాబాద్ లో ఒక కిడ్నాప్ ఘటన సంచలనంగా మారింది. హైదరాబాద్ లో డాక్టర్ హుస్సేన్ ని కిడ్నాప్ చేసారు.  ఈ కేసుని అనంతపురం పోలీసులు చేధించారు. నిందితులు ఉపయోగించిన రివాల్వర్ స్వాధీనం చేసుకున్న పోలీసులు... వారి వద్ద నుంచి కత్తి, మత్తు ఇంజక్షన్లు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ ఎక్సైజ్ అకాడమీ వద్ద క్లినిక్ నుంచి నన్ను కిడ్నాప్ చేశారు అని సదరు బాధిత డాక్టర్ చెప్పారు.

తొలుత ఓ గదిలో నిర్భందించారు అని ఆయన చెప్పారు. ఆ తర్వాత చిత్రహింసలకు గురిచేశారు, కాళ్లు, చేతులు కట్టేసి.. మోహాన్ని కప్పేసి తీసుకెళ్లారు, ఎందుకోసం కిడ్నాప్ చేసారో తెలియదు అని అన్నారు. రూ.10 కోట్లు డిమాండ్ చేసిన కిడ్నాప్ ముఠా... బిట్ కాయిన్ల రూపంలో ఇవ్వాలంటూ డాక్టర్ హుస్సేన్ పై ఒత్తిడి చేసింది. వాహనంలో డాక్టర్ హుస్సేన్ కాళ్లు చేతులు కట్టి  పడేసారు. రివాల్వర్ తో బెదిరింపులకు దిగారు.

మరింత సమాచారం తెలుసుకోండి: