ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఈ మధ్య కాలంలో వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఏదోక వివాదం వారిని వెంటాడుతూనే ఉంది. ఉన్నతాధికారులు సీరియస్ అయినా సరే కొందరి తీరులో మాత్రం మార్పు రావడం లేదు. తాజాగా గుంటూరు జిల్లాలో కొందరు రైతులకు బేడీలు వేసి తీసుకుని వెళ్ళారు. రైతులకు సంకెళ్ళు ఘటన పై ఎస్పీ విశాల్ గున్ని సీరియస్ అయ్యారు.

ఆరుగురు ఎస్కార్ట్ హెడ్ కానిస్టేబుల్స్ సస్పెండ్  చేసారు. ఆర్ఎస్ఐ , ఆర్ ఐ లకు చార్జ్ మోమోలు జారీ చేసారు. అదనపు ఎస్పీ తో విచారణ కు ఆదేశాలు జారీ చేసారు. కరోనా కారణంగా నరసరావుపేట సబ్ జైలు నుంచి 43 మంది రిమాండ్ లను జిల్లా జైలుకు తరలించే క్రమంలో సంకెళ్ళు వేసారు. ఈ ఘటనపై విపక్షాలు తీవ్ర స్థాయిలో అధికార పార్టీ టార్గెట్ గా విమర్శలు చేసాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: