ఈ ఏడాది దేశంలో సంచలనం సృష్టించిన ఘటనలలో వరంగల్ గొర్రెకుంట బావి ఘటన కూడా ఒకటి. 9 మందికి మత్తు మంది ఇచ్చి బావిలో నెట్టి చంపేసాడు సంజయ్ కుమార్ అనే వ్యక్తి. బెంగాల్ నుంచి వలస వచ్చిన కుటుంబం అక్కడ బలైపోయింది. ఈ ఘటనలో పోలీసులు దాదాపుగా నెల రోజుల్లో విచారణ పూర్తి చేసారు.  ఇక నేడు అతని కేసులో  కోర్ట్ తీర్పు వెల్లడించింది.

మే 20 న ఈ  ఘటన జరిగింది. దోషి సంజయ్ కుమార్ కి వరంగల్ జిల్లా సెషన్స్ కోర్ట్ ఉరి శిక్ష విధించింది.  న్యాయమూర్తి జయకుమార్ ఈ కేసులో తీర్పు ఇచ్చారు. ఈ హత్య కేసులో మొత్తం 67 మందిని జడ్జి విచారించారు. ఒక హత్యను దాచడానికి 9 మందిని చంపేసాడు. దేశం మొత్తం కూడా ఈ తీర్పు కోసం చాలా ఆసక్తిగా చూసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: