హైదరాబాద్ లో భారీ వరదల దెబ్బకు పరిస్థితి చాలా దారుణంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ పరిస్థితి ఎప్పుడు సాధారణ స్థితికి వస్తుంది అనేది చెప్పడం కాస్త కష్టమే. ఇక ఇదిలా ఉంటే తెలంగాణా సర్కార్ ప్రజలకు ఆర్ధిక సహాయం చేస్తుంది. సీఎం కెసిఆర్ ప్రకటించిన వరద బాధితుల సహాయాన్ని గల్లీ లీడర్లు నొక్కేస్తున్నారు. బోరబండలోని శివాజీ నగర్ లో  టీఆర్ఎస్ నేతల తీరు పై బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సిఎం కేసీఆర్ 10 వేలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.  పది వేల పరిహారానికి గాను రూ 5 వేల  కమీషన్ తీసుకొని సగానికి పైగా ఈ పరిహారాన్ని నొక్కేస్తున్నారు కొందరు తెరాస కార్యకర్తలు. వరద సహాయానికి సైతం మింగేస్తున్న వీరిపై స్థానిక అధికారులకు కూడా ఫిర్యాదు చేసారు. ఈ ఘటన సంచలనం అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: